ప్రారంభం కానున్న రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- March 10, 2025
న్యూఢిల్లీ:రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉంది.మణిపూర్లో హింసాత్మక సంఘటనలు, నియోజకవర్గాల పునర్విభజన, హిందీ భాష విధించడం, అమెరికన్ ఉత్పత్తుల దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే నిర్ణయం వంటి అంశాలపై పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదేసే అవకాశం ఉంది. మరోవైపు మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంటు ఆమోదం కోసం హోంమంత్రి అమిత్ షా తీర్మానాన్ని ప్రవేశపెడతారని తెలుస్తోంది. మణిపూర్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు. వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఫిబ్రవరిలో మొదటి బడ్జెట్ సమావేశం ముగిసిన సంగతి విదితమే.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







