మెక్సికోలో రెస్టారెంట్పై సాయుధుల దాడి 14 మంది మృతి
- June 25, 2017మెక్సికో:మెక్సికోలోని వెరాక్రుజ్ రాష్ట్రంలో సాయుధ దుండగులు ఓ రెస్టారెంట్పై దాడిచేసి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్ కమిషనర్ సహా పద్నాలుగు మందిని హతమార్చారు. మృతుల్లో మరో ఇద్దరు పోలీస్ అధికారులు నలుగురు పిల్లలున్నారు. దేశంలో మాఫియా ముఠాలు పెరిగిపోతున్నాయని, వాటిని ఉక్కుపాదంతో అణచివేస్తామని వెరాక్రుజ్ గవర్నర్ మిగ్వెల్ ఏంజెల్ యూన్స్ అన్నారు. దుండగుల కాల్పుల్లో మరణించిన పోలీస్ కమిషనర్ క్యామిలో కాస్టేగ్న్ రెండు రోజుల క్రితం ఓ కేసు పరిశోధనలో కొన్ని మృతదేహాలను కనుగొన్నాడని చెప్పారు. మాఫియా గ్యాంగ్లు హత్యలకు, కిడ్నాప్లకు, వసూళ్లకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్నాయని, వారిని తుదముట్టించేందుకు ఏం చేసేందుకైనా వెనుకాడము అని గవర్నర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు