దుబాయ్ పాఠశాలలో అగ్నిప్రమాదం : 2,200 మంది విద్యార్థులను క్షేమంగా ఖాళీ చేయించారు
- October 12, 2017దుబాయ్: దుబాయ్ లోని ఘర్హౌడ్ ప్రాంతంలోని అల్ ఖలీజ్ నేషనల్ స్కూల్లో ఒక ప్రాథమిక కళా తరగతి గదిలో గురువారం ( నేడు ) ఉదయం 11.50 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పాఠశాలలో ఉన్న 2,200 మంది విద్యార్థులను ఖాళీ చేయించారు.. దుబాయ్ సివిల్ డిఫెన్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు ఐదు నిమిషాల వ్యవధిలో పాఠశాలకు చేరుకున్నాయి. అగ్నిమాపక నియంత్రణ జట్టు ఎగిసిపడుతున్న మంటలను మధ్యాహ్నం 12.20 గంటలకు ఆర్పివేయగలిగేరు. అధికారులు మరియు ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం , మొట్టమొదటి అంతస్తులో పైకప్పుకు సమీపంలో ఉన్న ఒక ఎయిర్ కండిషన్డ్ నుండి పొగను గమనించామని వారు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. , దుబాయ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ పరిస్థితిని నియంత్రించిందని, విద్యార్థులు మరియు టీచింగ్ అధ్యాపకులు వెంటనే ఆవరణ నుండి ఖాళీ చేయించారు మరియు వారివరకు ఎటువంటి గాయాలూ లేవని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!