నైజీరియాలో ముగ్గురు మహిళల ఆత్మాహుతి దాడి
- October 23, 2017నైజీరియాలో ముష్కరులు పేట్రేగిపోయారు. ముగ్గురు మహిళా దళ సభ్యులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. మైదుగురి నగరంలోని ఓ రెస్టారెంట్ ఎదుట ఆదివారం రాత్రి 9.45 నిమిషాలకు ఓ మహిళ తనను తాను పేల్చేసుకుంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరో ఇద్దరు మహిళలు తమను తాము పేల్చివేసుకున్నారు. ఆహారం కోసం రెస్టారెంట్ వద్ద పలువురు వేచిఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాడి అనంతరం మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. క్షతగాత్రుల హాహాకారాలతో ఆప్రాంతమంతా రక్తసిక్తమైంది.
ఘటనాస్థలికి చేరుకున్న భద్రతాసిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించాయి. బొకోహరం ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు