మద్యం సేవించడానికి వయోపరిమితి పెంచనున్న కేరళ ప్రభుత్వం

- December 07, 2017 , by Maagulf
మద్యం సేవించడానికి వయోపరిమితి పెంచనున్న కేరళ ప్రభుత్వం

కేరళలో మద్యం సేవించడానికి వయోపరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 21 ఏళ్ల పరిమితిని 23 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆబ్కారీ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకు రావడానికి కేరళ ప్రభుత్వం సమాయత్తమైంది. మద్యం సేవించే వారి వయోపరిమితిని పెంచుతామని లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్‌డిఎఫ్‌) తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి అనుగుణంగా మంత్రివర్గం నిర్ణయం తీసుకుని, ఆర్డినెన్స్‌ ముసాయిదాను రూపొందించాల్సిందిగా ఆదేశిస్తూ న్యాయశాఖకు పంపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com