ఇది వంద అనారోగ్యాలను రానివ్వదు
- December 15, 2017పోషకాహార లేమితో బాధపడే వారికి తేనె దివ్య ఔషధం. తేనెను ప్రతిరోజు తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలు దరికిరావని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. తేనెలో విటమిన్ సితో పాటు ప్రొటీన్స్, ఆమైనోఆమ్లాలు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, సోడియం, వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్రక్రోజ్ 38 శాతం, గ్లూకోజ్ 31శాతం, సుక్రోజ్ 1 శాతం, నీరు 17శాతం ఇతరత్రా చక్కెరలు 9 శాతం ఉంటాయి. పంచదారతో పోలిస్తే తేనెలో కేలరీలు ఎక్కువ. తేనెలోని పిండి పదార్థాలు సులభంగా గ్లూకోజ్గా మారిపోవడంతో తేలిగ్గా జీర్ణ మౌతాయి. వేడినీటిలో ఒక స్పూను తేనె, దాల్చిన చెక్క పొడి వేసి, బాగా కలిపి, ఆ నీటిని కొద్దిసేపు పుక్కిలిస్తే నోటి దుర్వాసన పరారవుతుంది. తేనె, దాల్చిన చెక్క పొడిని కలిపి బ్రెడ్ స్లైస్ మీద రాసుకుని తీసుకుంటే కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఈ విధంగా రోజుకు మూడు పూటలా తింటే క్యాన్సర్ దరికిరాదు. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు తేనె, దాల్చిన చెక్కల మిశ్రమం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తేనె సూక్ష్మజీవుల సంహారిణి. బాక్టీరియా, ఈస్ట్ వంటి సూక్ష్మజీవులను ఎదగనివ్వదు. తేనెలోని కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని అందిస్తాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు