ఒమన్లో టొబాకోపై ట్యాక్స్ పెంపు
- February 12, 2018మస్కట్: ఒమన్లో టొబాకోపై ట్యాక్స్ పెరగనుంది. ఇది రెండింతలు కానున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. 200 శాతం వరకు పెంపు ఉంటుందని, ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాయల్ హాస్పిటల్ సీనియర్ అధికారి మాట్లాడుతూ, టొబాకో వాడకాన్ని తగ్గించేందుకోసం ముందుగా టొబాకో వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. అలాగే పొగాకు వాడకంపై నిషేధాజ్ఞలు విధించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి తెలిపారు. టొబాకో ఉత్పత్తులపై ట్యాక్స్ పెంచడం మరో మార్గం. ఈ మూడూ ఒకేసారి చేపట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 2016లో ఒమన్లో టొబాకోపై ట్యాక్స్ని 100 శాతం పెంచింది. జిసిసిలోని మిగతా దేశాలూ ఇదే తరహా చర్యలు తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..