ఫేక్ గన్తో దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్
- February 12, 2018
సౌదీ అరేబియా: సౌదీ పోలీస్, నైజీరియాకి చెందిన వ్యక్తిని దొంగతనం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. రియాద్లోని సౌదీ కుటుంబాన్ని ఫేక్ గన్తో బెదిరించి పట్ట పగలే నిందితుడు దోపిడీకి పాల్పడ్డాడు. రియాద్లో ఇలాంటి దొంగతనం ఇంతకుముందెన్నడూ జరగలేదని పోలీస్ అధికారులు చెబుతున్నారు. దోపిడీ ఘటనకు సంబంధించి సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డ్ అయిన టేటాను పోలీసులు విశ్లేషించారు. అనంతరం 38 ఏళ్ళ నిందితుడ్ని ట్రాప్ చేసి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. దొంగతనం చేసే క్రమంలో సెక్యూరిటీ కెమెరాని కూడా నిందితుడు ధ్వంసం చేశాడు. గేట్ దూకిన నిందితుడు సర్వైలెన్స్ కెమెరాని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించాడు. విల్లాలోని మహిళను ఫేక్ గన్తో బెదిరించగా, ఆమె కుమారుడు సకాలంలో అక్కడికి చేరుకుని, దొంగని పట్టుకునే ప్రయత్నంలో ఉండగా, దొంగ పారిపోయాడు. అనంతరం అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆయుధాలతో దొంగతనాలకు పాల్పడేవారిపై సౌదీలో కఠిన చర్యలుంటాయి. మరణ శిక్షలు సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది నిందితులకి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







