ఏషియన్ రెస్టారెంట్లో వ్యక్తి హత్య
- February 19, 201833 ఏళ్ళ పాకిస్తానీ వ్యక్తి, ఆసియన్ రెస్టారెంట్లో హత్యకు గురయ్యాడు. నహ్దా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఏషియన్ రెస్టారెంట్లో పాకిస్తానీ వ్యక్తిని పలుమార్లుప పొడిచి చంపారు. మృతుడ్ని ఎంఎ ఖాన్గా గుర్తించాఉ. కిచెన్ నైఫ్తో అతన్ని చంపేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు సరదాగా మాట్లాడుకుంటుండగా, వారి మధ్య తగాదా ప్రారంభమయ్యిందనీ, ఈ క్రమంలోనే ఓ వ్యక్తి, మృతుడ్ని బలంగా పొడిచాడని తెలియవస్తోంది. పోలీసులు ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, సంఘటనా స్థలానికి వెళ్ళారు. ఫోరెన్సిక్, సీఐడీ, క్రైమ్ సీన్, పెట్రోల్, అంబులెన్స్ విభాగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. బాధితుడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించి, వైద్య చికిత్స అందించినా ఉపయోగం లేకుండా పోయింది. రెస్టారెంట్లో ఉన్నవారిని విచారించి, వివరాల్ని నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితుడి అరెస్ట్పై ఖచ్చితమైన సమాచారం లేదు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?