మధ్యప్రదేశ్:ఘోర రోడ్డు ప్రమాదం.. 22 మంది మృతి
- April 18, 2018మధ్యప్రదేశ్ రాష్ట్రం సిధి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 22 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పెళ్లి అనంతరం జరిగే రిసెప్షన్ వేడుక ముగించుకుని కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి వస్తున్నారు. ఈక్రమంలో వారి వాహనం జోగ్దాహా బ్రిడ్జిపై వెళుతోంది. వేగంగా వెళుతున్న వాహనం బ్రిడ్జి గోడకి గుద్దుకోవడంతో సోన్ నదికి సుమారు 70 అడుగుల ఎత్తులో ఉన్న ట్రక్కు పడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం స్థానికుల సహాయంతో గాలించగా స్పాట్లోనే 15 మంది మృతి చెందినట్లు, మరో 7గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుంటే మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేల సహాయాన్ని ప్రకటించినట్లు తెలియజేశారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!