నేడే 'నా పేరు సూర్య' ఆడియో లాంచ్
- April 21, 2018
అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'నా పేరు సూర్య'. 'నా ఇల్లు ఇండియా' అనేది టాగ్లైన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్పై వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ మిలిటరీ ఆఫీసర్గా దర్శనమీయనున్నాడు. బన్నీ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్లుక్, టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందాయి.
కాగా నేడు (ఆదివారం) ఈ సినిమా ఆడియో వేడుక నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పశ్చిమ గోదావరి జిల్లాలోని మిలిటరీ మాధవరం వేదిక కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కాబోతున్న ఈ వేడుకలో అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్తో పాటు చిత్ర బృందం అంతా పాల్గొనబోతోంది. ఈ సినిమా మే 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..







