అరుదైన ఘనత సాంధించిన ప్రిన్ప్ మహేష్

- April 26, 2018 , by Maagulf
అరుదైన ఘనత సాంధించిన ప్రిన్ప్ మహేష్

ప్రిన్స్ మహేష్ బాబు ఓ అరుదైన ఘనత సాధించాడు.డిల్లీలోని ప్రఖ్యాత 'మేడమ్ టుస్సాడ్స్' మ్యూజియంలో అతని మైనపు బొమ్మను ఏర్పాటు చేయనున్నారు. ఈ  విషయాన్ని మహేష్ బాబు తన ట్విటర్  ఖాత  ద్వార వెల్లడించారు.ఇప్పటికే ఈ మ్యూజియంలో బాలీవుడ్, హాలీవుడ్, క్రీడా, రాజకీయ  ప్రముఖుల మైనపు బొమ్మలు ఉన్నాయి.  బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్‌లతో పాటు  బాహుబ‌లి చిత్రంతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌భాస్ బొమ్మలు  'మేడమ్ టుస్సాడ్స్' మ్యూజియంలో ఇప్పటికే కొలువు తీరాయి.తాజాగా మహేష్  వారి జాబితాలో చేరిపోయాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com