తగ్గిన బంగారం ధర...
- April 27, 2018
దిల్లీ:పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో ఇటీవల బంగారం ధర బాగా పెరిగింది. కాగా అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో నేటి బులియన్ మార్కెట్లో పసిడి ధర పడిపోయింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కూడా డిమాండ్ తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. నేడు పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.190 తగ్గి రూ.32,210గా ఉంది. వెండి కూడా ఇదే బాటలో పయనించింది. కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.40,450గా ఉంది. పారిశ్రామిక అవసరాలకు, నాణేల తయారీకి కూడా డిమాండ్ తగ్గినట్లు తెలుస్తోంది. రూపాయి మారం విలువ బలహీన పడి డాలరు విలువ పెరగడం కూడా ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.48శాతం తగ్గి 1316.30డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 0.27శాతం తగ్గి 16.47 డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









