దుబాయ్:14 మిలియన్ దిర్హామ్ దొంగతనం ఏడుగురిపై విచారణ
- April 27, 2018
దుబాయ్:మనీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవర్, అతని ఇద్దరి స్నేహితులు 14 మిలియన్ దిర్హామ్ దొంగతనం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. 14 మిలియన్ దిర్హామ్ల విలువైన 10 ఏటీఎం బాక్సుల్ని దొంగతనం చేసినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. వీరికి సహకరించిన మరో నలుగురిపైనా కేసులు నమోదయ్యాయి. వీరందరూ పాకిస్తాన్కి చెందినవారే. వీరిలో ఒకరు మనీ ఎక్స్ఛేంజ్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఫేక్ పాస్పోర్టులపై పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దొంగతనం కోసం పూర్తిగా సన్నద్ధమైన వీరంతా పకడ్బందీగా హోటల్ రూమ్స్ని కూడా తాత్కాలిక నివాసం నిమిత్తం బుక్ చేసుకున్నట్లు విచారణలో తేలింది. దొంగతనం జరిగిన రెండు గంటల్లోనే దేశం నుంచి పారిపోయేందుకు ఫేక్ పాస్పోర్టులు సిద్ధం చేసుకున్నట్లు మొదటి నిందితుడు విచారణలో చెప్పాడు. నిందితులంతా 27 నుంచి 48 ఏళ్ళ వయసులోపువారే.
తాజా వార్తలు
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!
- నేడు యూఏఈ తో టీమిండియా తొలి మ్యాచ్!