దుబాయ్:14 మిలియన్ దిర్హామ్ దొంగతనం ఏడుగురిపై విచారణ
- April 27, 2018
దుబాయ్:మనీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవర్, అతని ఇద్దరి స్నేహితులు 14 మిలియన్ దిర్హామ్ దొంగతనం కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. 14 మిలియన్ దిర్హామ్ల విలువైన 10 ఏటీఎం బాక్సుల్ని దొంగతనం చేసినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. వీరికి సహకరించిన మరో నలుగురిపైనా కేసులు నమోదయ్యాయి. వీరందరూ పాకిస్తాన్కి చెందినవారే. వీరిలో ఒకరు మనీ ఎక్స్ఛేంజ్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఫేక్ పాస్పోర్టులపై పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దొంగతనం కోసం పూర్తిగా సన్నద్ధమైన వీరంతా పకడ్బందీగా హోటల్ రూమ్స్ని కూడా తాత్కాలిక నివాసం నిమిత్తం బుక్ చేసుకున్నట్లు విచారణలో తేలింది. దొంగతనం జరిగిన రెండు గంటల్లోనే దేశం నుంచి పారిపోయేందుకు ఫేక్ పాస్పోర్టులు సిద్ధం చేసుకున్నట్లు మొదటి నిందితుడు విచారణలో చెప్పాడు. నిందితులంతా 27 నుంచి 48 ఏళ్ళ వయసులోపువారే.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









