ఫేక్ గోల్డ్ విక్రయం: ఇద్దరి అరెస్ట్
- April 30, 2018షార్జాలో ఫేక్ గోల్డ్ విక్రయిస్తోన్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ షార్జా పోలీస్, పెయింటెడ్ మెటల్ (3 కిలోలు) కలిగి వున్న ఇద్దర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్కియాలజీ సైట్ నుంచి తాము బంగారాన్ని వెలికి తీశామని చెబుతూ, అమాయకుల్ని ఈ నిందితులు మోసం చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు, పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. బంగారాన్ని అధీకృత బంగారు వ్యాపార సంస్థల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలనీ, తక్కువ ధర పేరుతో నకిలీ బంగారాన్ని విక్రయించే వారి పట్ల అప్రమత్తంగా వుండాలని షార్జా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఇబ్రహీమ్ ముసాబా అల్ అజెల్ చెప్పారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!