మోడీని కలిసిన కామన్వెల్త్ పతక విజేతలు
- April 30, 2018
ఢిల్లీ:ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత విజేతలు ప్రధాని నరేంద్రమోడీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన 21వ కామన్వెల్త్ క్రీడల్లో బాక్సింగ్ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన బాక్సర్ హుసాముద్దీన్ 56 కేజీల వ్యక్తిగత శరీర బరువు కేటగిరీలో తలపడి కాంస్య పతకాన్ని సాధించాడు. భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు 9 పతకాలు సాధించగా.. అందులో హుసాముద్దీన్ క్యాంస పతకాన్ని సాధించడం గమనార్హం. ఆనవాయితీలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీని సోమవారం ఢిల్లీలో కలిశారు. విజేతలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపి ప్రశంసించారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









