ఫ్యామిలీతో మహేష్ పారిస్ టూర్
- April 30, 2018సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం బిగ్ హిట్ కొట్టడంతో ఈ సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీతో వెకేషన్ టూర్ వేశాడు మహేష్. సినిమా రిలీజ్కి ముందే ఓ సారి పారిస్ వెళ్లొచ్చిన మహేష్ మరోసారి అదే ప్రదేశానికి వెళ్ళాడు. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. సినిమా రిలీజ్ తర్వాత భరత్ అనే నేను సినిమా ప్రమోషన్స్లో భాగంగా విజయవాడ వెళ్ళాడు. అక్కడ థియేటర్లో ఫ్యాన్స్తో కలసి సినిమా చూశాడు. రెండు ఫ్లాపుల తర్వాత ఇంత పెద్ద హిట్ ఇచ్చిన కారణంగా పలు పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించాడు మహేష్. విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తిరుపతి వెళ్ళాడు. ఆ తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహాస్వామి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. తాను బ్రతికినంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటానని మహేష్ తెలిపిన విషయం విదితమే. త్వరలో వంశీ పైడిపల్లి సినిమా టీంతో జాయిన్ కానున్నాడు మహేష్. ఈ చిత్రం తొలి షెడ్యూల్ న్యూయార్క్లో జరగనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్