ఫ్యామిలీతో మహేష్ పారిస్ టూర్
- April 30, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం బిగ్ హిట్ కొట్టడంతో ఈ సక్సెస్ని ఫుల్గా ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీతో వెకేషన్ టూర్ వేశాడు మహేష్. సినిమా రిలీజ్కి ముందే ఓ సారి పారిస్ వెళ్లొచ్చిన మహేష్ మరోసారి అదే ప్రదేశానికి వెళ్ళాడు. ఈ విషయాన్ని నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. సినిమా రిలీజ్ తర్వాత భరత్ అనే నేను సినిమా ప్రమోషన్స్లో భాగంగా విజయవాడ వెళ్ళాడు. అక్కడ థియేటర్లో ఫ్యాన్స్తో కలసి సినిమా చూశాడు. రెండు ఫ్లాపుల తర్వాత ఇంత పెద్ద హిట్ ఇచ్చిన కారణంగా పలు పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించాడు మహేష్. విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తిరుపతి వెళ్ళాడు. ఆ తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహాస్వామి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. తాను బ్రతికినంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటానని మహేష్ తెలిపిన విషయం విదితమే. త్వరలో వంశీ పైడిపల్లి సినిమా టీంతో జాయిన్ కానున్నాడు మహేష్. ఈ చిత్రం తొలి షెడ్యూల్ న్యూయార్క్లో జరగనున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







