200 కోట్ల క్లబ్లో చేరిన 'రంగస్థలం'
- April 30, 2018రంగమ్మా మంగమ్మా ఇంకా వినిపిస్తూనే ఉంది. రామ్ చరణ్ రంగస్థలం రికార్డులను బ్రేక్ చేస్తూ 200 కోట్ల క్లబ్లో చేరింది. నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. మార్చి 30 న విడుదలై నెల రోజుల్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రంగస్థలం నిలిచింది. ఈ సినిమాకు అన్నీ ప్లస్ పాయింట్లే కావడం రికార్డులు సృష్టించడానికి కారణమైంది. సుకుమార్ డైరక్షన్, రాంచరణ్ యాక్షన్తో మిగిలిన తారాగాణమంతా కథకు చక్కగా సరిపోయారు. అందరూ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అన్నింటికీ మించి దేవీ శ్రీ మ్యూజిక్, దానికి తోడు చంద్రబోస్ సాహిత్యం. ఒక్కటేమిటి అన్నీ కలిసొచ్చి అంశాలు రంగరించి రంగస్థలాన్ని నిర్మించారు. అందుకే అభిమానులు ఆదరించి పట్టం కట్టారు. భారీ స్థాయిలో నిర్మాతలకు విజయాన్ని అందించిన రంగస్థలం, 200 ల కోట్ల క్లబ్లో చేరి రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక గ్రాస్ రికార్డులు నెలకొల్పిన చిత్రంగా నిలిచిపోతుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?