'మయ్యమ్ విజిల్' పార్టీ యాప్ను ప్రారంభించిన కమల్
- April 30, 2018
చెన్నై: ప్రముఖ సినీ నటుడు, 'మక్కల్ నీది మయ్యమ్' అధినేత కమల్ హాసన్ మంగళవారం 'మయ్మమ్ విజిల్' అనే పేరుతో పార్టీకి చెందిన యాప్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాప్ పార్టీ నేతలకు అలారమ్లాంటిదని, సామాన్య ప్రజల సమస్యలను తెలసుకోవడానికి మా పార్టీ నేతలు పాత్రికేయుల్లాగా పనిచేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీలో నమోదు చేసిన నేతలకు, వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ యాప్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటాము కాని, వెంటనే పరిష్కారం చూపలేమని, ఎందుకంటే ఈ యాప్ మంత్రదండం కాదని ఆయన అన్నారు. అధికారులు, నేతలపై పర్యవేక్షణకు ఈ యాప్ ఉపపయోగపడుతుందన్నారు. తమిళనాడును అవినీతి రహితంగా మార్చడమే తన రాజకీయ అజెండా అంటూ ఫిబ్రవరిలో 'మక్కల్ నీది మయ్యమ్' అనే పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







