కోలుకుంటున్న చిన్నారుల్ని కోల్పోయిన తండ్రి
- May 02, 2018
మస్కట్: భారతీయ వలసదారుడు కన్నన్ సుభాస్, కోలుకుంటున్నారు. షినాస్లో ఇటీవల జరిగిన ప్రమాదంలో కన్నన్ సుభాస్ తన కుమారుడు, కుమార్తెను కోల్పోయారు. 43 ఏళ్ళ కన్నన్, నాలుగేళ్ళ రోహిత్, ఆరేళ్ళ చంద్రిక బైక్ మీద వెళుతుండగా, బైక్ స్కిడ్ అవడంతో వీరంతా మరో వాహనం కిందికి దూసుకుపోయారు. ఈ ప్రమాదంలో కన్నన్ కుమారుడు, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో కన్నన్ ఆసుపత్రిలో చేరారు. షినాస్లోని ఓ ప్రభుత్వ కాలేజీలో టీచర్గా పనిచేస్తున్నారు. సమ్మర్ వెకేషన్ సందర్భంగా తన కుటుంబాన్ని ఒమన్కి తీసుకొచ్చారాయన. వచ్చేవారంలో తిరిగి వారంతా స్వదేశానికి వెళ్ళాల్సి వుంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో ప్రస్తుతం కన్నన్ చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







