ఫేక్ బాంబ్: అన్నదమ్ములకు జైలు
- May 25, 2018మనామా: హై క్రిమినల్ కోర్ట్ ఇద్దరు అన్నదమ్ములకు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఫేక్ బాంబ్ని ప్లాంట్ చేయడం ద్వారా పబ్లిక్ పీస్ని దెబ్బతీసేందుకు వీరు ప్రయత్నించినట్లు అభియోగాలు నిరూపించబడ్డాయి. జైలు శిక్షతోపాటు, వీరి పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వీరిపై తీవ్రవాద నేరాభియోగాలు మోపబడ్డాయి. రద్దీగా వుండే ప్రాంతంలో బాంబుని పోలి వుండే వస్తువుని వీరు వుంచగా, భయపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాంబ్ ఎక్స్పర్ట్స్తో ఆ వస్తువుని పరీక్షింపజేసి, దాన్ని ఫేక్ బాంబుగా తేల్చారు. ఆ వస్తువు నుంచి ఫింగర్ ప్రింట్స్ సేకరించగా, అవి నిందితుడి ఫింగర్ ప్రింట్స్తో సరిపోయాయి. ఈ కేసులో ఇంకో వ్యక్తికి ఏడాది జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్