యు.ఏ.ఈ:ఈ ఉల్లంఘనకి పాల్పడితే 50,000 దిర్హామ్ల జరీమానా
- July 17, 2018యు.ఏ.ఈ:అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ క్రాఫ్ట్ ఓనర్లకు సంబంధించి జరీమానా రిమైండర్ని జారీ చేసింది. జెట్ స్కీ ఇంజిన్ నెంబర్ల టాంపరింగ్కి పాల్పడితే 50,000 దిర్హామ్ల వరకు జరీమానా విధించనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పేర్కొంది. ఈ ఉల్లంఘనకు పాల్పడితే జెట్ స్కీ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు, దాన్ని స్వాధీనం చేసుకోవడమూ జరుగుతుంది. బీచ్కి 200 మీటర్ల లోపల జెట్ స్కీ వినియోగిస్తే జరీమానా తప్పదు. పర్సనల్ వాటర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన నిబంధనల ప్రకారం మొదటి పెనాల్టీ 500 దిర్హామ్లు కాగా, రెండో పెనాల్టీకి 1000 దిర్హామ్లు చెల్లించాలి. మూడో పెనాల్టీకి 2000 దిర్హామ్ల జరీమానా విధించబడటమే కాకుండా వాహనాన్ని నెల రోజులపాటు స్వాధీనం చేసుకుంటారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..