గ్రూప్ వెడ్డింగ్ త్వరలో
- September 13, 2018మస్కట్: పెళ్ళి ఖర్చుల్ని భరించలేని యువతీ యువకుల కోసం అల్ సీబ్లో గ్రూఫ్ వెడ్డింగ్ని నిర్వహించబోతున్నారు. నవంబర్ 23న ఈ వివాహాలు జరుగుతాయి. సోషల్ డెవలప్మెంట్ కమిటీ - విలాయత్ ఆఫ్ సీబ్ వీటిని నిర్వహించనుంది. 20,000 నుంచి 25,000 ఒమన్ రియాల్స్ ఇందుకోసం ఖర్చు కానుంది. షురా కౌన్సిల్లో అల్ సీబ్ ప్రతినిథి హిలాల్ అల్ సర్మి ఆర్గనైజింగ్ కమిటీ హెడ్గా వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం పెళ్ళికొడుకు ఒమనీ సిటిజన్ అయి వుండాలి. విలాయత్ ఆఫ్ సీబ్కి తొలి ప్రయారిటీ ఇస్తారు. గ్రూమ్కి మరో భార్య వుండకూడదు. గ్యారంటీ కింద 200 ఒమన్ రియాల్స్ డిపాజిట్ చేయాల్సి వుంటుంది. గ్రూమ్స్ 50 మంది స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ని ఈ కార్యక్రమం కోసం తీసుకురావాల్సి వుంటుంది. సెప్టెంబర్ 9న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటికే 8 అప్లికేషన్లు వచ్చాయి.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!