నిర్మాత డబ్బులు ఎగ్గొట్టాడు.. కోర్టుకు ఎక్కిన టాప్ హీరో..
- September 14, 2018మొన్నటికి మొన్న తమిళ్ హీరో శింబు రూ.50లక్షలు అడ్వాన్స్ తీసుకుని షూటింగ్కి రాకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఆ చిత్ర నిర్మాత కోర్టుని ఆశ్రయించాడు. ఇప్పుడు మరో కేసు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్. నిర్మాత ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదని హీరో అరవింద్ స్వామి కోర్టుకి ఎక్కారు. చదురంగవేట్టై-2 అనే సినిమాలో హీరోయిన్ త్రిషతో కలిసి నటించారు అరవింద్ స్వామి. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు, నిర్మాత మనోబాలా ప్రొడ్యూసర్గా వ్యవహరించారు.
ముందుగా కుదుర్చుకున్న ఒప్పందంలో కొంత డబ్బు బాకీ రూ.1.79 కోట్లు చెల్లిచాల్సి ఉంది. ఎన్ని సార్లు అడిగినా దాటవేస్తున్నారు నిర్మాత మనోబాలా. వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లాల్సి వస్తుందన్నా ఏ మాత్రం స్పందించలేదు. దీంతో తమకు ఇవ్వాల్సిన మొత్తంతో పాటు 18 శాతం వడ్డీ కూడా చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు అరవింద్ స్వామి. ఈ విషయమై సెప్టెంబర్ 20 లోపు కోర్టుకు నిర్మాత వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు మనోబాలకు నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!