పెరుగు తీసుకుంటే... స్లిమ్గా ఉంటారు...
- October 12, 2018స్లిమ్గా ఉండేందుకు ఆహారాన్ని తగ్గించుకోవడం, వైద్య చికిత్సలు తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. అధిక బరువు గలవారు కడుపును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
స్లిమ్గా ఉండేందుకు ఆహారాన్ని తగ్గించుకోవడం, వైద్య చికిత్సలు తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తుంటారు. అధిక బరువు గలవారు కడుపును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకు ప్రతిరోజూ కప్పు పెరుగు తీసుకుంటే అధిక బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగులోని క్యాల్షియం శరీరంలో కొవ్వును తగ్గించి స్లిమ్గా ఉండేలా చేస్తుంది. హార్మోన్లను ఉత్పత్తిచేస్తుంది. పెరుగులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తుంది. పెరుగును తరచుగా తీసుకుంటే ఇతర చిరుతిండి పదార్థాలు తీసుకోవాలనిపించదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ చిరుతిండి పదార్థాలు తినడం వలన అధిక బరువు పెరుగు దాంతో కడుపు కూడా పెరుగుతుంది.
అంతేకాకుండా శరీరం కొవ్వు పెరిగిపోతుంది. కనుక పెరుగు తప్పకుండా డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది. 200 గ్రాముల పెరుగులో 300 గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెప్తున్నారు. ఈ క్యాల్షియం కడుపులోని కొవ్వును బయటకు పంపుటకు ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?