ప్రాస్టిట్యూషన్: 8 మందికి జైలు
- October 15, 2018దుబాయ్:ఏడుగురు పురుషులు, ఓ మహిళ ప్రాస్టిట్యూషన్ కేసులో దోషులుగా తేలారు. దుబాయ్ న్యాయస్థానం వీరికి జైలు శిక్ష ఖరారు చేసింది. అరెస్టయినవారంతా పాకిస్తానీయులే. డిసెంబర్ 7న అల్ మురాక్కాబాత్లో, నిందితులు బాధఙతులకు ఫేక్ ఏజ్లతో పాస్పోర్టులను ఇప్పించినట్లు విచారణలో తేలింది. 17 ఏళ్ళ బాధితురాలు, తమను యూఏఈకి రప్పించి, ప్రాస్టిట్యూషన్ చేయించేందుకు యత్నించారని పేర్కొనడం జరిగింది. నిందితులు, బాధితులకు పాస్పోర్ట్, ఎంట్రీ పర్మిట్తోపాటుగా విమాన టిక్కెట్లను అందించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిందితురాలు, ఆ యువతుల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారిని అల్ హమ్రియాలోని ఓ ఇంటికి తరలించారు. ఆ మరుసటి రోజు అల్ బరాహాలోని ఓ ఫ్లాట్కి తీసుకెళ్ళారు వ్యభిచారం కోసం. సీఐడీ అధికారులు, డిసెంబర్ 7న ఫ్లాట్పై దాడి చేయగా, ప్రాస్టిట్యూషన్ బయటపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు