సైక్లిస్ట్పై దాడి, దోపిడీ
- November 05, 2018షార్జా క్రిమినల్ కోర్టులో ఆసియాకి చెందిన ఓ వ్యక్తిపై దాడి, దొంగతనం అభియోగాలు నమోదయ్యాయి. నిందితుడు, ఓ సైక్లిస్ట్పై దాడి చేసి 10,000 దిర్హామ్లను దోచుకున్నట్లు అభియోగాల్లో పేర్కొన్నారు. షార్జాలోని సజా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులతో కలిసి నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడు. సాయంత్రం 7 గంటల సమయంలో సజా ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో తాను సైకిల్పై వెళుతుండగా, ముగ్గురు వ్యక్తులు తనను ఆపి, దారి చూపించమని అడిగారనీ, అంతలోనే వారు తనపై దాడికి దిగి, దోచుకున్నారని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కత్తితో బెదిరించి దాడి చేసినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. అయితే న్యాయస్థానంలో నిందితులు మాత్రం తామెలాంటి దాడికి పాల్పడలేదని అంటున్నారు. కేసు విచారణ నవంబర్ 28వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!