రేపటి నుంచి తెలంగాణ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
- November 11, 2018హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 19 వరకు నామినేషన్ల దాఖలు చేసుకోవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 22 వరకు ఉంది. కాగా, డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యగా సీటీ పోలీసు కమిషనర్, అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైనప్పటినుంచి నామినేషన్ల ఉపసంహరణ వరకు ఆయా ప్రాంతాల్లో 100 మీటర్ల దూరంలో ఎక్కడా కూడా ఐదుగురు కంటే ఎక్కువ మంది కలిసి తిరగరాదని హెచ్చరించారు. ఎవరైనా ఆదేశాలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీపీ హెచ్చరించారు. మరోవైపు అధికార పార్టీ టీఆర్ఎస్తో పాటు ప్రజాకూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?