అమెరికా:భీకరమైన మంటలు.. 42 మంది మృతి..
- November 13, 2018అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో ఏర్పడిన కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. భీకరమైన మంటల కారణంగా ఇప్పటివరకు 42 మంది మరణించారు. వందలాదామంది గాయపడ్డారు. అయితే కాలిఫోర్నియా చరిత్రలోనే ఈ ప్రమాదం అతిపెద్దదని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 6వేల 5వందల నివాస ప్రాంతాలు బుగ్గిపాలయ్యాయి. దాదాపు 90వేల ఎకరాల భూమి కాలిబూడిదైంది.
మంటలను అదుపుచేసేందుకు 8వేల మంది నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మంటల్లో తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 50వేల నివాస ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉందని, దాదాపు రెండులక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఎగిసిపడుతున్న మంటల కారణంగా ఎక్కడ చూసినా భయానక వాతావరణమే కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల