చాల్లేదు.. ఇంకా కావాలి: విమానంలో మహిళ రచ్చ
- November 15, 2018ఎవరన్నారు బాస్.. మహిళలు మగవారికంటే తక్కువని.. ఎందులోనూ తక్కువ కాదు.. మళ్లీ మాట్లాడితే రెండాకులు ఎక్కువే.. వారికైతే అడిగినంత పోస్తారు.. మాకు మాత్రం ఎందుకివ్వరు.. మద్యం మత్తు నషాళానికి ఎక్కినా మరికొంత కావాలంటూ అసభ్య పదజాలంతో విమాన సిబ్బందిని దూషించింది ఓ నవ నాగరికురాలు.
అప్పటికే మోతాదుకు మించి మద్యాన్ని సేవించి ఉన్న ఐరిష్ మహిళ ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ విమానంలో ప్రయాణిస్తోంది. సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి క్యాబిన్ క్రూ కమాండర్కు ఫిర్యాదు చేశారు. ఇంకోసారి ఆమె మద్యం అడిగితే అస్సలు ఇవ్వొద్దని కమాండర్ సూచించారు.
అదే విషయం ఆమెకు చెప్పడంతో కోపంతో రగిలిపోయింది. తీవ్రపదజాలంతో సిబ్బందిని దూషించింది. పైలట్ వద్దకు వచ్చి అతని మీద ఉమ్మి వేసింది. ఆమె అంత చేస్తున్నా పైలట్ ఏమాత్రం కోప్పడలేదు. ఇంతకీ ఆమె ఎవరూ అని ఆరా తీస్తే ఓ
ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ విభాగంలో లాయర్ అని తెలుసుకున్నారు విమాన సిబ్బంది.
బ్రిటన్కు చెందిన ఈ 50 ఏళ్ల లాయరమ్మ ఈనెల 10న ముంబై నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ఎక్కింది. తనను తాను ఓ లాయర్ అని విమాన సిబ్బందిని పరిచయం చేసుకుంది. కొద్దిసేపటి తరువాత ఓ గ్లాస్ వైన్ కావాలని అడిగింది. అది తాగేసి మరో గ్లాస్ కావాలని కోరింది.
దీనికి సిబ్బంది నిరాకరించడంతో వారిని దుర్భాషలాడింది. అంతే కాకుండా మిమ్మల్ని కోర్టుకు ఈడుస్తా, ఇండియన్స్ అయిన మీరు డబ్బుకు కక్కుర్తి పడుతున్నారని నోటికి వచ్చినట్లు మాట్లాడింది. ఎయిర్ ఇండియా యాజమాన్యం పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో లండన్లోని హిత్రో విమానాశ్రయంలో ఆమెను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..