ఆ సంఘటనకి థ్రిల్ ఐన దీపికా పదుకోనె

- January 02, 2019 , by Maagulf
ఆ సంఘటనకి థ్రిల్ ఐన దీపికా పదుకోనె

 

ట్రెండ్‌ని తమకు అనుకూలంగా మలచుకుని బిజినెస్ చేసుకోవడంలో ముందుంటారు కొంతమంది. రెస్టారెంట్లలో కొన్ని ఐటెమ్స్‌కు సినీ సెలబ్రిటీల పేర్లు తగిలించి బిజినెస్ చేయడం చూస్తూనేవుంటాం. ఇలాంటి సర్‌ప్రైజ్ బాలీవుడ్‌ నటి దీపికకు ఎదురైంది. తన భర్త రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి హనీమూన్ కోసం అమెరికా వెళ్లింది.

 
న్యూఇయర్‌ని అక్కడే సెలబ్రేట్ చేసుకుంది ఈ జంట. టెక్సాస్‌లో గడిపిన ఈ జంట, స్థానిక రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడి మెనూలో దీపిక పేరుతోవున్న దోశను చూసి దీప్‌వీర్ సర్‌ప్రైజ్‌ అయ్యారు. వెంటనే ఆ మెనూని ఫొటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు రణ్‌వీర్‌. నాకు ఆ దోశ తినాలనుందని చిన్న క్యాప్షన్‌ కూడా ఇచ్చేశాడు.

ఈ ఫొటోను చూసి రోహిత్‌ అనే నెటిజన్‌, పుణెలో ఓ రెస్టారెంట్‌లో దీపిక పేరుతో రోటీలను అమ్ముతున్నారని వెల్లడిస్తూ మెనూ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. మొత్తానికి తన పేరుతో ఐటెమ్స్ చూసుకుని దీపికా తెగ మురిసిపోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com