హైదరాబాద్ లో 13 నుంచి అంతర్జాతీయ పతంగుల పండుగ
- January 08, 2019ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను ఈనెల 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కైట్ ఫెస్టివల్, స్వీట్ ఫెస్టివల్ వివరాలను సోమవారం సచివాలయంలో వెల్లడించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19 దేశాలకు చెందిన 42 సంస్థల ప్రతినిధులు, 60 మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కైట్ ఫెస్టివల్తో పాటు ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తామన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో 3 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో.. వెయ్యి రకాల వంటకాలు ప్రదర్శిస్తామన్నారు. ఆగాఖాన్ అకాడమీతో సంయుక్తంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెంకటేశం తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు