KGF దర్శకుడితో ప్రభాస్
- January 10, 2019ప్రభాస్లో భారీ సినిమాలు తీసేందుకు అనేక నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. సాహో. ఈ ఏడాదిలో రానుంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లుగా తేల్చారు. మరో పిరియాడికల్ లవ్ స్టోరీ సినిమాలో కూడా నటిస్తున్నారు. దీనికి రాధాకృష్ణ దర్శకుడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివర్లో పూర్తవుతాయి. ఆ తర్వాత ఆయన కమిట్మెంట్ ఏమిటనేది స్పష్టం కాలేదు.
బాహుబలి ప్రేరణలో కన్నడలో తీసిన కేజీఎఫ్ మంచి విజయం పొందింది. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్కు మంచి పేరు వచ్చింది. పరిమిత వ్యయంతో సినిమాలు తీసే కన్నడ భాషలో ఇంత పెద్ద భారీ బడ్జెట్ చిత్రం తీసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. అందుకే ప్రశాంత్తో సినిమా చేసేందుకు పలువురు స్టార్స్ ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. తాజాగా ప్రశాంత్, ప్రభాస్ కలయికలో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందట. గతంలో దిల్ రాజు సంస్థలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాలో ప్రభాస్ నటించారు. మళ్లి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు