బ్రెగ్జిట్లో ఓడారు.. విశ్వాసంలో నెగ్గారు..
- January 17, 2019బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు ఆ దేశ ప్రధాని థెరిసా మె పై విశ్వాసం ఉంచారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదలగాలన్న నిర్ణయం (బ్రెగ్జిట్)పై జరిగిన ఓటింగ్లో ఆమె ఓడిపోయారు. కానీ, ఆమెపై పార్లమెంట్లో జరిగిన అవిశ్వాస పరీక్షలో మాత్రం విజయం సాధించారు. అంటే తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో థెరిసా మె గెలుపొందారు. దీంతో థెరిసా బ్రిటన్ ప్రధానిగా కొనసాగనున్నారు.
325 మంది ఎంపీలున్న బ్రిటన్ పార్లమెంట్లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి థెరెసా మె పై లేబర్ పార్టీ అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించారు. ఇందులో 306 మంది ఎంపీలు థెరిసాకు అనుకూలంగా ఓటు వేశారు.
ఫలితంగా లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అనంతరం బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలకు రావాల్సిందిగా ప్రతిపక్ష నేతలను బ్రిటన్ ప్రధాని థెరెసా ఆహ్వానించారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై వీలైనంత త్వరగా నిర్ణయానికి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?