డ్రగ్స్ స్మగ్లింగ్: కువైటీ, ఆసియన్ అరెస్ట్
- January 17, 2019కువైట్ సిటీ: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తుల్ని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఆసియా జాతీయుడు కాగా, మరొకరు కువైటీ. ఆసియా జాతీయుడి నుంచి 38 పీస్ల కన్నాబిస్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు సుమారు 250 గ్రాములు. ఇండియా నుంచి నిందితుడు కువైట్కి వస్తుండగా ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మరో ఘటనలో, కువైటీ నిందితుడి నుంచి మరిజువానాని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా నుంచి నిందితుడు కువైట్కి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దర్నీ జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ డ్రగ్స్ కంట్రోల్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?