మహేష్ బాబుకు అరుదైన గౌరవం..
- February 15, 2019తెలుగు సూపర్స్టార్ మహేష్ బాబుకు అరుదైన గౌరవం దక్కనుంది. గత ఏప్రిల్లో మహేష్ బాబు మైనపు బొమ్మను తయారు చేస్తున్నట్లు ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ ప్రకటించింది. ముందుగా అనుకున్నట్లే ఆ మైనపు బొమ్మ తయారీ పూర్తిచేసింది. మలేషియాలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అతి త్వరలో మహేష్ బాబు మైనపు ప్రతిమ కొలువుదీరనుంది. ఈలోగా ఆ మైనపు ప్రతిమను హైదరాబాద్లో ఒకరోజు ప్రదర్శించాలని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ నిర్వాహకులు నిర్ణయించారు. ఇలా ఒక నటుడి మైనపు ప్రతిమను సొంత నగరంలో అభిమానుల మధ్య ప్రదర్శించడం మేడమ్ టుస్సాడ్స్ సంస్థకు ఇదే తొలిసారి. ఈ విధంగా మహేష్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఏప్రిల్లో మహర్షి ఘనంగా విడుదలయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?