సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..
- February 22, 2019బాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. వర్ధమాన నటి సంఘమిత్ర రాయ్ ఛటర్జీ మృతి చెందారు. వెండితెరపై అవకాశాలు అందిపుచ్చుకుంటూ.. నటిగా ఎదుగుతున్న ఈ యంగ్ హీరోయిన్ గత కొన్ని రోజులుగా బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హఠాత్తుగా క్యారాబెల్ అటాక్ రావడంతో ఆమె మృత్యువాత పడింది. రెండేళ్ల పాటు మృత్యువుతో పోరాడిన సంఘమిత్ర.. అలసిపోయి మరణం ముందు ఓడిపోయి.. చివరకు గురువారం నాడు మృత్యువు ఒడిలోకి చేరింది.
‘దామిని’, గహీన్ హృదయ్’ , దేక్ కమాన్ లగే’, మూవీలో నటించింది సంఘమిత్ర. నటిగా, మోడల్గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె నిర్మాతగానూ తనను తాను నిరూపించుకోవాలని ఆశపడింది. ఇందులో భాగంగానే నిర్మాత ప్రదీప్ చురీవాల్తో కలిసి ఓ సినిమా నిర్మించేందుకు కూడా రెడీ అయింది. సంఘమిత్రకు ఆరేళ్ల కూతురు ఉంది. అయితే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని.. వెండితెరపై రాణించేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు