అమల ముఖ్యపాత్రలో వెబ్సిరీస్
- April 15, 2019శ్రీమతి అక్కినేని అమల చాలా రోజుల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. జి5 యాప్ నిర్మించిన వెబ్సిరీస్ హై ప్రిస్ట్స్లో అమల ముఖ్యపాత్ర పోషించారు.. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ వెబ్సిరీస్ ఈనెల 25 నుంచి జి5 లో ఆన్లైన్ అవుతుంది.. ఈసందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు.. టారో రీడింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్సిరీస్ను పుష్ప డైరెక్టు చేశారు. ఈ వెబ్సిరీస్లో అమలతోపాటు నటుడు బ్రహ్మాజీ, వరలక్ష్మిశరత్ కుమార్, సునైనా, బిస్బాస్ 2ఫేం నందిత తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీమతి అమల మాట్లాడారు.. కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల తెరపై తక్కువగా కన్పిస్తున్నానని, చాలా రోజుల తర్వాత పుష్పగారు చెప్పిన లైన్ నచ్చటంతో ఈ ప్రాజెక్టులో నటించేందుకు ఒప్పుకున్నానని తెలిపారు.. తనకు బాగా ఆసక్తిగా అన్పించే టారో రీడింగ్ నేపథ్యంలో ఈ వెబ్సిరీస్ కథ ఉండటం తనకు బాగా నచ్చిందన్నారు. ప్రేక్షకులకు కూడ నచ్చుతుందని అన్నారు..
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!