అమల ముఖ్యపాత్రలో వెబ్సిరీస్
- April 15, 2019శ్రీమతి అక్కినేని అమల చాలా రోజుల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. జి5 యాప్ నిర్మించిన వెబ్సిరీస్ హై ప్రిస్ట్స్లో అమల ముఖ్యపాత్ర పోషించారు.. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ వెబ్సిరీస్ ఈనెల 25 నుంచి జి5 లో ఆన్లైన్ అవుతుంది.. ఈసందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు.. టారో రీడింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్సిరీస్ను పుష్ప డైరెక్టు చేశారు. ఈ వెబ్సిరీస్లో అమలతోపాటు నటుడు బ్రహ్మాజీ, వరలక్ష్మిశరత్ కుమార్, సునైనా, బిస్బాస్ 2ఫేం నందిత తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా శ్రీమతి అమల మాట్లాడారు.. కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం వల్ల తెరపై తక్కువగా కన్పిస్తున్నానని, చాలా రోజుల తర్వాత పుష్పగారు చెప్పిన లైన్ నచ్చటంతో ఈ ప్రాజెక్టులో నటించేందుకు ఒప్పుకున్నానని తెలిపారు.. తనకు బాగా ఆసక్తిగా అన్పించే టారో రీడింగ్ నేపథ్యంలో ఈ వెబ్సిరీస్ కథ ఉండటం తనకు బాగా నచ్చిందన్నారు. ప్రేక్షకులకు కూడ నచ్చుతుందని అన్నారు..
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు