యూ.ఏ.ఈ విష్ణుసహస్రనామం గ్రూప్ ఆధ్వర్యం లో సాముహిక సత్యనారాయణ వ్రతం
- April 30, 2019యూ.ఏ.ఈ లో గల విష్ణుసహస్రనామం గ్రూప్ ఆధ్వర్యం లో గత గురువారం (ఏప్రిల్ 24) నుండి శనివారం(ఏప్రిల్ 26) వరకు సాముహిక సత్యనారాయణ వ్రతం మరియు విష్ణుసహస్రనామ అఖండ పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భక్తులు 44 గంటల పాటు ఏకధాటిగా 144మార్లు విష్ణుసహస్రనామ స్తోత్ర పఠనం చేసారు. గురువారం ఉదయం సుప్రభాత సేవ తో మొదలైన ఈ కార్యక్రమం, అనంతరం స్వమివారి అభిషేకం, మహానివేదన అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతం, మహాప్రసాదం తదితర కార్యక్రమాలతో కొనసాగింది. శుక్రవారం తిరిగి సుప్రభాత సేవ తో మొదలై కొనసాగిన అఖండ విష్ణుసహస్రనామ పారాయణ శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్య లో హాజరైన భక్తులు స్వామివారి అమూల్యమైన కృపకు పాత్రులయ్యారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!