అక్షయ్ కుమార్.. రియల్ హీరో
- May 07, 2019పెను తుపాను బాధితులు ధైర్యంగా ఉండాలని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ ట్వీట్ చేశాడు. ఫొని దెబ్బకు విలవిల్లాడిన ఒడిశాకు ఆపన్నహస్తం అందించాడు అక్షయ్. ప్రకృతి విధ్వంసంలో దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రానికి కోటి తుపాను సాయం ప్రకటిస్తూ, మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాడు. ప్రకృతి విపత్తులు సంభవించినపుడు ఆయా ప్రాంతాలకు తనవంతు సాయం అందించటం అక్షయ్కు కొత్త కాదు. కేరళ, చెన్నై ప్రాంతాల్లోనూ ఇటీవల తుపాన్లు భీభత్సం సృష్టించినపుడు -అక్షయ్ తనవంతు సాయాన్ని ప్రకటించాడు. '్భరత్ కే వీర్' వెబ్సైట్ ద్వారా జవానుల కుటుంబాలను ఆదుకోవడం నాకు సంతృప్తినిచ్చే విషయమని పదేపదే చెప్పే అక్షయ్కుమార్, ఇటీవలి కాలంలో దేశభక్తి చిత్రాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడమూ తెలిసిందే. పెను తుపానుగా విరుచుకుపడిన ఫొని, ఒడిశా రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?