అగ్ని ప్రమాదం: 13 మంది భారతీయులు క్షేమం
- May 08, 2019షార్జా సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటర్స్ అత్యంత వేగంగా స్పందించడంతో 13 మంది భారతీయులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఓ బర్నింగ్ కార్గో ధో ఈ అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఖాలిద్ పోర్ట్ వద్ద షార్జా క్రీక్లో ఈ ధో యాంకర్ చేయబడింది. 6000 గ్యాలర్ల డీజిల్, 120 ఎక్స్పోర్టెడ్ వెహికిల్స్, 300 వెహికిల్ టైర్స్ ఈ 'ధో'లో వున్నాయి. ఇవన్నీ కాలి బూడిదైపోయినట్లు అధికారులు వెల్లడించారు. షిప్ (ధో) అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి వుంది. రికార్డు సమయంలో ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రాణాపాయం సంభవించలేదని షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ సమి అల్ నక్బి చెప్పారు. ఇదే ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడో సారి. షిప్లోకి కార్గోని ఎక్కించే క్రమంలో మంటలు చెలరేగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..