నీళ్లు నిలబడి తాగితే చాలా..
- May 21, 2019పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అనేది సామెత వరకేనండి. కానీ నిలబడి నీళ్లు తాగితే చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు. రోజుకి కనీసం 8గ్లాసుల నీళ్లు తాగితే మంచిదని తెలుసుగానీ నిలబడి తాక్కూడదని తెలియదు చాలా మందికి. ఇలా తాగితే ఆరోగ్య పరంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం..
ఇలా తాగితే కిడ్నీలకు ఆ నీరు అందదని.. దాంతో కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధుల భారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి చేరతాయి. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీంతో అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశయం గోడలు దెబ్బ తింటాయి. జీర్ణాశయ గోడలు దెబ్బతింటే.. అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.
నిలబడి నీరు తాగితే ద్రవాల సమతుల్యత దెబ్బతినడంతో ఎక్కువ ద్రవాలు కీళ్లలో చేరిపోయి కీళ్ల నొప్పులకు దారి తీస్తాయి.
కూర్చున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో నీరు తీసుకుంటే తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాకుండా జీర్ణాశయంలోకి అధికంగా ఉత్పత్తి అయ్యే ఆమ్లాల ప్రభావం కూడా తగ్గుతుంది.
సో.. తెలియక ముందు తాగేసాం. మరి తెలిసాక కూడా అలానే చేయకూడదు కదండీ. కూర్చుని తాగే ప్రయత్నం చేస్తూ వ్యాధులకు దూరంగా ఉంటే మంచిదేమో ఓ సారి ఆలోచించండి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?