5జి నెట్వర్క్: ఎటిసలాట్ తొలి మెనా నెట్వర్క్
- May 30, 2019యూ.ఏ.ఈ:ఎట్టకేలకు యూఏఈలో 5జి సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. టెలికామ్ ఆపరేటర్ ఎటిసలాట్, ఇకపై యూఏఈలో వినియోగదారులు 5జి నెట్వర్క్ని పొందవచ్చునని ప్రకటించింది. ఎలాంటి అదనపు ఛార్జీలూ లేకుండా 5జి రెడీ జెడ్టిఇ యాక్సన్ 10 ప్రో ద్వారా ఈ కొత్త అనుభూతిని పొందడానికి వీలుంది. 4జితో పోల్చితే 20 రెట్లు వేగంతో 5జి సేవలు వినియోగదారులకు గొప్ప అనుభూతినివ్వనున్నాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అత్యంత వేగంతో కూడిన నెట్వర్క్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఎటిసలాట్ పేర్కొంది. యాక్సాన్ 10 ప్రో కొనుగోలు కోసం మూడు ఆప్షన్స్ని ఎటిసలాట్ వినియోగదారుల ముందుంచింది. వీటిల్లో స్ట్రెయిట్ పేమెంట్ కింద 5,555 దిర్హామ్లు చెల్లించవచ్చు. అలాగే, 12, 18, 24 నెలల ఇన్స్టాల్మెంట్స్ ప్రాతిపదికన 473, 318, 241 దిర్హామ్లు చెల్లించడానికీ అవకాశం కల్పిస్తున్నారు. పోస్ట్పెయిడ్, ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ సేవలు అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు