పాస్పోర్టు 11 రోజుల్లోనే జారీ:మురళీధరన్
- July 12, 2019న్యూ ఢిల్లీ :కేంద్రం గుడ్ న్యూస్ వినిపించింది. పాస్ పోర్టు కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పంది.సాధారణ పరిస్థితుల్లో 11 రోజుల్లోనే పాస్పోర్టు జారీ చేస్తామని లోక్సభలో కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. పాస్పోర్టు పొందేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కాంగ్రెస్కు చెందిన ఎంపీ మనీశ్ తివారీ ప్రస్తావించారు.
పాస్ పోర్టు పొందే విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని... విచారణ పేరుతో ఆలస్యం జరుగుతోందని ఒక్కోసారి పాస్ పోర్టు రద్దయే పరిస్థితి కనిపిస్తోందని ఎంపీ తివారీ చెప్పారు. దీనిపై మంత్రి సమాధానమిచ్చారు.పాస్పోర్టు జారీ ప్రక్రియలో పోలీస్ వెరిఫికేషన్ కోసం 731 పోలీస్ జిల్లాల్లో యాప్ను ఉపయోగిస్తున్నామని మంత్రి చెప్పారు.
యాప్ ద్వారా అవినీతి రహితంగా విచారణ జరగమే కాకుండా, త్వరగా పాస్ పోర్టు పొందేందుకు అవకాశం కలుగుతోందన్నారు. దేశంలో 36 పాసుపోర్టు కేంద్రాలు ఉన్నాయని, 93 పాసుపోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయని వివరించారు.412 పోస్టాఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాలు ఉన్నాయని, వీటిని నడిపేందుకు ఓ ప్రైవేట్ సంస్థ సహకారం తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్