దుబాయ్కి విమాన సర్వీసుల్ని ప్రారంభించిన విస్తారా
- August 22, 2019భారతదేశానికి చెందిన విస్తారా ఎయిర్ లైన్స్ ముంబై మరియు దుబాయ్ మధ్య డైలీ సర్వీస్లను ప్రారంభించింది. విస్తారాకి ఇది రెండో అంతర్జాతీయ డెస్టినేషన్ కావడం గమనార్హం. ముంబై నుంచి ఆగస్ట్ 21న బయల్దేరిన విస్తారా తొలి విమానం, దుబాయ్కి 6 గంటలకు చేరుకుంది. ముంబై నుంచి సాయంత్రం 4.25 నిమిషాలకు బయల్దేరే విమానం, దుబాయ్కి సాయంత్రం 6.15 నిమిషాలకు చేరుకుంటుంది. దుబాయ్ నుంచి 7.15 నిమిషాలకు ప్రారంభమై ముంబైకి 12.15 నిమిషాలకు చేరుకుంటుంది. బిజినెస్, ఎకానమీ క్లాస్తోపాటు ప్రీమియమ్ ఎకానమీ క్లాస్లో తాము విమాన సర్వీసుల్ని అందిస్తున్నట్లు విస్తారా వెల్లడించింది. ఇదిలా వుంటే, తమ మూడో అంతర్జాతీయ డెస్టినేషన్ అయిన బ్యాంకాక్కి ఈ నెల 27న విమాన సర్వీస్ ప్రారంభించనుంది విస్తారా.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?