మక్కా, మదీనాలోని 79 హాస్పిటాలిటీ కేంద్రాలు మూసివేత..!!
- March 16, 2025
మక్కా: అవసరమైన లైసెన్స్లు పొందకుండా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినందుకు మక్కా, మదీనాలోని 79 ఆతిథ్య కేంద్రాలకు జరిమానా విధించడంతోపాటు వాటిని పర్యాటక మంత్రిత్వ శాఖ మూసివేయించింది. రమదాన్ మొదటి రెండు వారాల్లో ఉల్లంఘనలకు పాల్పడ్డ మక్కాలోని 58 ఆతిథ్య కేంద్రాలు, మదీనాలో 21 ఆతిథ్య సౌకర్యాలకు మొత్తం SR 500,000 జరిమానాలు విధించింది.
పర్యాటక చట్టం మరియు నిబంధనలను ఉల్లంఘించే కేంద్రాలపై చట్టబద్ధమైన జరిమానాలను విధిస్తూనే ఉంటామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ జరిమానాలు SR1 మిలియన్ వరకు ఉంటాయని, మూసివేత లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. అన్ని టూరిస్ట్ హాస్పిటాలిటీ కేంద్రాలు పర్యాటక చట్టం, దాని నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని.. ఆపరేషన్కు ముందు అవసరమైన లైసెన్స్లను పొందాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మరింత సమాచారంకోసం నంబర్ 930 కు కాల్ చేయాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!