ధోఫర్‌లో మర్డర్..వ్యక్తి మృతికి గొడవే కారణమా?

- March 19, 2025 , by Maagulf
ధోఫర్‌లో మర్డర్..వ్యక్తి మృతికి గొడవే కారణమా?

మస్కట్: ధోఫర్ గవర్నరేట్‌లోని సలాలాలోని విలాయత్‌లో ఘోరం జరిగింది. ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న రాయల్ ఒమన్ పోలీసులు (ROP) సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపి, ఒక ప్రవాసిని అరెస్టు చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణల కారణంగా జరిగిన ఘోరమైన మర్డర్ జరిగిందని తెలిపారు. ఆసియా దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చెలరేగిందని, ఈ క్రమంలోనే హత్య  జరిగిందని, ఈ కేసులో ఒక ప్రవాసిని అరెస్టు చేసినట్లు ధృవీకరించారు. అరెస్టు చేసిన వ్యక్తిపై ఇప్పుడు చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com