యూఏఈలో సైబర్ అటాక్స్.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలే టార్గెట్..!!
- March 25, 2025
యూఏఈ: జాతీయ సైబర్ భద్రతా వ్యవస్థలు..ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలోని అనేక వ్యూహాత్మక రంగాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన సైబర్ దాడులను విజయవంతంగా అడ్డుకున్నాయని యూఏఈ సైబర్ భద్రతా మండలి వెల్లడించింది. సంబంధిత అధికారుల సహకారంతో అత్యవసర సైబర్ భద్రతా వ్యవస్థలు, కీలకమైన రంగాలను లక్ష్యంగా చేసుకుని డేటా లీక్లతో సహా కీలకమైన జాతీయ వ్యవస్థలను ఉల్లంఘించే లక్ష్యంతో 634 సైబర్ దాడులను గుర్తించాయని అధికార యంత్రాంగం తెలిపింది.
యూఏఈ సైబర్ భద్రతా మండలి ఛైర్మన్ డాక్టర్ మొహమ్మద్ అల్ కువైట్ మాట్లాడుతూ.. థ్రెట్ యాక్టర్ "rose87168" అనే సైబర్ దాడి ఒరాకిల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ను ఛాన్నభిన్నం అయిందన్నారు. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 6 మిలియన్ల కస్టమర్ రికార్డులు లీక్ అయ్యాయని తెలిపారు. సున్నితమైన వినియోగదారు పాస్వర్డ్ డేటాను కలిగి ఉన్న ఈ రికార్డులు.. ప్రపంచవ్యాప్తంగా 140,000 సంస్థలను ప్రభావితం చేసిందన్నారు. ఇందులో యూఏఈలోని 634 సంస్థలు ఉన్నాయని, వీటిలో 30 ప్రభుత్వ సంస్థలు, 13 ప్రైవేట్ సంస్థలు ఉన్నాయని వివరించారు.
సైబర్ భద్రతా మండలి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను వారి సైబర్ భద్రతా రక్షణలను బలోపేతం చేయాలని, వారి సైబర్ సంసిద్ధతను మెరుగుపరచాలని, ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే నివేదించాలని కోరింది.
తాజా వార్తలు
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం