తీవ్రవాదాన్ని అణచివేయక తప్పదు
- July 06, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ముందస్తు దాడుల ద్వారా తీవ్రవాదానికి చెక్ పెట్టవచ్చునని అభిప్రాయపడింది. దేశాన్ని తీవ్రవాదం నుంచి రక్షించాలంటే, ఇదొక్కటే మార్గమని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ అల్ ఖాలెద్ అల్ హమాద్ అల్ సబా చెప్పారు. తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికి సంబంధించి ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా పలు సూచనలు, సలహాల్నిపరిగణనలోకి తీసుకున్నారు. జిసిసి దేశాలతో సంయుక్తంగా తీవ్రవాదంపై పోరాటం చేయాల్సి ఉంటుందనీ, అప్పుడే జిసిసి రీజయన్ తీవ్రవాదుల నుంచి ఉపశమనం పొందుతుందని తెలిపారు షేక్ మొహమ్మద్. ఈద్ అల్ ఫితర్ సందర్భంగా దేశంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతోపాటు, అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటున్నట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









